కుటుంబ పాలన అంతం కోసమే రాజీనామా చేశా – రాజగోపాల్ రెడ్డి

-

నల్గొండ జిల్లా చండూరులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నామినేషన్ కార్యక్రమానికి తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, సహ ప్రబారి అరవింద్ మీనన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, కుటుంబ పాలన అంతం కోసమే రాజీనామా చేశానని అన్నారు.

మునుగోడు ప్రజలు తనని ఆశీర్వదించాలని కోరారు. తాను ఎలాంటి ఆర్థిక లబ్ది పొందలేదని.. పొందినట్లు నిరూపిస్తే ఏ శిక్ష కైనా సిద్ధమన్నారు. భారతీయ జనతా పార్టీ ద్వారా తనకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరాలేదన్నారు. దీనిపై తాను ఏ గుడిలోనైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మోడీ, అమిత్ షా ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి పదంలో కొనసాగుతుందన్నారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం బిజెపిని మునుగోడులో గెలిపించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news