కమ్యూనిస్ట్ లు, కోదండరాంలను కలుపుకుని పోరాడదాం – రేవంత్ రెడ్డి

-

మునుగోడు ఉప ఎన్నికలపై మరో వీడియో విడుదల చేశారు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. కమ్యూనిస్ట్ లు, కోదండరాంలను కలుపుకుని పోరాడదామని కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు రేవంత్‌ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా సమస్యల ప్రాతిపదికన జరగాల్సిన చర్చ వ్యక్తిగత విమర్శలు దారితీస్తుందని.. కేంద్రం లో ఉన్న బీజేపీ సర్కర్ వల్ల గ్యాస్,డీజిల్,పెట్రోల్, నిత్యవసర ధరలు భారీగా పెరిగాయని పేర్కొన్నారు.

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు..ఏడాది కి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని.. పార్లమెంట్ లో నేను అడిగిన ప్రశ్న కు 22 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారని ఫైర్‌ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక కు బీజేపీ 5 వేల కోట్లు కేటాయిస్తే అక్కడి సమస్యలు తీరుతాయి…మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరాడని ఆగ్రహించారు. డబుల్ బెడ్ రూమ్,ఇంటికో ఉద్యోగం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు.. వారికి ఓటు అడిగే హక్కు లేదని పేర్కొన్నారు. ప్రజల పక్షాన ఈ రెండు పార్టీల ను ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ కి ఉందని రేవంత్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news