సోనియా గాంధీకి అవమానం అంటే భారత మాత, తెలంగాణ తల్లికి అవమానమే – రేవంత్

-

సోనియా గాంధీ ఇవాళ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలోనే రేవంత్‌ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సోనియా గాంధీకి అవమానం అంటే భారత మాత, తెలంగాణ తల్లికి అవమానమేనని ఫైర్‌ అయ్యారు రేవంత్.

తల్లి లాంటి సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలిచి అవమాన పరిచాడని మోడీ పై నిప్పులు చెరిగారు. మన తల్లిని ఎవడైనా అవమానించే పని చేస్తే.. తలనరికే వరకు ఉరుకుంటమా..? Ed.. సీబీఐ లు మా పార్టీ నాయకుల ధైర్యాన్ని దెబ్బతీయలేవని మోడీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ కి రాక్షస ఆనందం ఉండొచ్చు.. కానీ దేశానికి మంచిది కాదన్నారు. ఏ దేశం లో మహిళలు అవమానం చేస్తే.. ఆ దేశంకి మంచిది కాదు అనేది గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు రేవంత్‌ రెడ్డి. వచ్చేది కాంగ్రెస్‌ సర్కార్‌ అని బీజేపీ పార్టీ అంతు చూస్తామని వార్నింగ్‌ ఇచ్చారు రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news