హరీష్ రావును భర్తరఫ్ చేయాలి – రేవంత్ రెడ్డి

-

ఇబ్రహీంపట్నం ఆసుపత్రి ఘటనలో మంత్రి హరీష్ రావును భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం ఘటనపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలను రేవంత్ రెడ్డి ఆదేశించారు. కెసిఆర్, హరీష్ రావు మహిళా హంతకులని మండిపడ్డారు. చనిపోయిన మహిళా కుటుంబాలను హరీష్ రావు పరామర్శించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.

ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. అలాగే గురువారం నుంచి మునుగోడు లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం ప్రారంభమవుతుందని తెలిపారు రేవంత్ రెడ్డి. మండల ఇన్చార్జిలు ఒక్కొక్కరు మూడు గ్రామాలు తిరగాలని రేవంత్ రెడ్డి సూచించారు. సెప్టెంబర్ మూడవ తేదీన ప్రెస్ మీట్ ఉంటుందని.. అందులో రైతు డిక్లరేషన్ ని వివరిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 6 వ తేదీ వరకు ఒక విడత ప్రచారం పూర్తవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news