తెలంగాణను మరో పంజాబ్ గా మార్చకండని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ గుట్కా లేదు, మట్కా లేదు అని కేసీఆర్ చెప్పారని.. కానీ గల్లీ గల్లీలో గంజాయి గుప్పు మంటుంది అని నేను అప్రమత్తం చేశానని పేర్కొన్నారు. ఈ గుట్కా , మట్కా , డ్రగ్స్ పై నిఘా లేక పోతే మరో పంజాబ్ అవుతుందని ప్రభుత్వం ను హెచ్చరించానని.. చిన్నారి పై జరిగిన లైంగిక దాడి, గంజాయి మత్తులో జరిగిందని ఒక వైపు ప్రభుత్వం చెపుతుందని ఫైర్ అయ్యారు.