సీఎం కేసీఆర్‌ ఓ దొంగ.. సిగ్గు కూడా లేదు – వైఎస్‌ షర్మిల

-

సీఎం కేసీఆర్‌ ఓ దొంగ.. సిగ్గు కూడా లేదని వైఎస్‌ షర్మిల సంచలన వ్యాక్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 7వేల కొనుగోలు కేంద్రాలకు గాను తెరిచింది 2వేలు మాత్రమేనని…. ఇందులోనూ 100 సెంటర్లలో కూడా వడ్లు కొనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 లక్షల టన్నులకు, ఇప్పటి వరకు కొన్నది 2లక్షల టన్నులలోపేనని… వడ్లు అమ్ముడుపోక అకాల వానలకు నానుతుంటే కేసీఆర్ కు మాత్రం పట్టడం లేదని ఆగ్రహించారు.

25 వేల రూపాయల రైతు పథకాలు బంద్ పెట్టి, కేవలం 5వేలు ఇచ్చి రైతులు కోటీశ్వరులు అయ్యారని, కార్లలో తిరుగుతున్నారని గప్పాలు కొడుతుండని మండిపడ్డారు. ఇక్కడ అంతా బ్రహ్మాండంగా ఉందని దేశం పోతాడటనని… ఎజెండా మారుస్తాడట. రాజ్యాంగాన్ని మారుస్తాడట. అమ్మకు అన్నం పెట్టడు గానీ పిన్నమ్మకు బంగారు గాజులట అంటూ వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు.

సిగ్గుండాలి ముఖ్యమంత్రికి. కేసీఆర్ ఒక దొంగ. పోడు పట్టాలు ఇవ్వకపోగా ఉన్న భూములు గుంజుకున్నాడని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలను మనుషుల్లానే చూడడం లేదని… పురుగుల్లా చూస్తున్నారని ఆగ్రహించారు. బాంచన్ దొరా అని కాళ్లమీద పడేలా చేస్తున్నరు. సామాన్యులు అప్పులుపాలై ఆత్మహత్యలు చేసుకోవాలి. కేసీఆర్ కుటుంబం మాత్రం కోటలు కట్టుకోవాలా? అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news