TRSతో ఎంత దరిద్రం ఉందో.. BJPతో కూడా అంతే ఉంది – షర్మిల

-

వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. TRSతో ఎంత దరిద్రం ఉందో BJP తో కూడా అంతే దరిద్రం ఉందని చురకలు అంటించారు. TRS లీడర్లు దాక్కొని మాట్లాడటం కాదని… దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడండని సవాల్ విసిరారు.

YSR బిడ్డ బెదిరేది కాదు.TRS, BJP దొందూ దొందేనన్నారు షర్మిల. ఇరు పార్టీల మధ్య సంబంధం అందరికీ తెలుసు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని BJP చెప్పడం తప్ప ఎంక్వైరీ చేయించడం లేదని చెప్పారు.

విద్యుత్ శాఖ మంత్రి ఇలాఖాలో కరెంట్ సమస్యలతో ఇద్దరు రైతులు చనిపోయినా పరామర్శించే సోయి లేదు. బిడ్డను కాపాడుకోవడం కోసం ఢిల్లీలో కేసీఆర్ పాట్లు.. ఓట్ల కోసం మునుగోడులో మంత్రుల ఫీట్లు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్లు TRS నాయకులవి ఎప్పుడూ స్వార్థ రాజకీయాలేనని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news