వేములవాడ బ్రిడ్జిపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

-

నిన్న వైఎస్‌ షర్మిల వేములవాడ నియోజక వర్గంలో పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే…ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఫైర్‌ అయ్యారు షర్మిల. ‘కేసీఆర్ పాలనలో నాణ్యత నవ్వులపాలు… నిధులు కమీషన్ల పాలు’. వేములవాడ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుండగా.. వైయస్ఆర్ నిర్మించిన బ్రిడ్జిపై ప్రయాణించాను. వరదలకు బ్రిడ్జి చెక్కుచెదరలేదు కానీ కేసీఆర్ నిర్మించిన రోడ్డు మాత్రం వరదలో కొట్టుకుపోయిందని ఆగ్రహించారు.

ప్రజాప్రస్థానం పాదయాత్రకు తరలివచ్చి, ఆశీర్వదించిన వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. అన్ని వర్గాలకు పథకాలు ప్రవేశపెట్టి, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి పరిచిన వైయస్ఆర్ బాటలోనే వైయస్ఆర్ బిడ్డ నడుస్తుందని మీకు మాటిస్తున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్ఆర్ సంక్షేమ పాలనను తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news