మంత్రి మల్లారెడ్డితో ఈటల ముచ్చట్లు.. వీడియో వైరల్

-

నిన్న హైదరాబాద్‌ వ్యాప్తంగా బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ బోనాల పండుగలో రాజకీయా నాయకుల నుంచి సెటబ్రీటీల వరకూ అందరూ పాల్గొన్నారు. ఆదివారం ఈ పండుగ రావడంతో.. సంబురాలకు హద్దులు లేకుండా పోయాయి.

అయితే..ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తి కర సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌ లో జరిగిన బోనాల జాతర లో మంత్రి మల్లారెడ్డి తో ఈటల రాజేందర్‌ ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించారు. సికింద్రాబాద్ ఏడు గుళ్ల దేవాలయం లో జరిగిన బోనాల జాతరకు హాజరయ్యారు బీజేపీ నేత ఈటల రాజేందర్.

అయితే… మంత్రి మల్లారెడ్డి తో ఎదురు పడడం తో కాసేపు పలకరించి ముచ్చటించారు ఈటల రాజేందర్. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియా లో వైరల్‌ గా మారింది. కాగా.. గత ఏడాది టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లి, బీజేపీ ఈటల రాజేందర్ చేరిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news