నేడు వరంగల్ కు తెలంగాణ సీఎం కేసీఆర్..పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

-

సీఎం కేసిఆర్ వరంగల్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఇవాళ ఉదయయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరంగల్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సిఎం కేసిఆర్ ఇవాళ ఉదయం 9.00 గంటలకు ప్రగతి భవన్ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. ఉదయం 11.15 గంటలకు వరంగల్ ములుగు రోడ్డులోని ప్రతిమ హాస్పిటల్ కు చేరుకుంటారు.

అనంతరం ప్రతిమ రిలీఫ్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం చేస్తారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం వరంగల్ నుండి మధ్యాహ్నం 2.00 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిన్న యాదాద్రి లక్ష్మీ నరసింహ్మస్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news