BREAKING : తెలంగాణలో వైద్యులకు సెలవులు రద్దు !

-

వరద ముంపు ప్రాంతాల ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి హరీష్‌రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. డాక్టర్లు ఎవరూ సెలవులు తీసుకోవద్దని కోరారు.

ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు హరీష్‌రావు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో చోటుచేసుకున్న ప్రకృత్తి విపత్తు, తద్వారా గోదావరి పరీవాహక ప్రాంతం లో పోటెత్తిన వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (ఆదివారం) ఉదయం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.

సిఎం గారి ఏరియల్ సర్వే కడెం నుంచి భధ్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతంలో కొనసాగనున్నది. ఈ సర్వేలో సిఎం గారితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొననున్నారు. ఈ మేరకు… సిఎం గారు చేపట్టే ఏరియల్ సర్వే కు సంబంధించిన హెలికాప్టర్ రూటు సహా తదితర విధి విధానాలను అధికార యంత్రాంగం పర్యవేక్షించి రూట్ ను ఫైనల్ చేయనున్నది.

Read more RELATED
Recommended to you

Latest news