సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత.. రైలు పట్టాల మధ్యలో నిప్పు పెట్టిన ఆర్మీ అభ్యర్థులు

-

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున ఆర్మీ అభ్యర్థులు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న బస్సులపై రాళ్లు రువ్వారు. అద్దాలను ధ్వంసం చేశారు. అలాగే రైల్వే స్టేషన్ లోకి చొచ్చుకెళ్లిన ఆర్మీ అభ్యర్థులు.. రాళ్లతో రైలు పై దాడి చేస్తూ నానా హంగామా సృష్టించారు.రాళ్లు రువ్వడంతో భయబ్రాంతులకు గురి అయిన ప్రయాణికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.

దేశానికి సేవలు అందించాలననే ఆసక్తి గల యువత త్రివిధ దళాల్లో నియమించేందుకు కేంద్రం తాజాగా అగ్నిపద్ పథకం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకానికి యువత నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కేవలం నాలుగేళ్లు సైనిక సర్వీసులో ఉంచి ఆ తరువాత ఇంటికి పంపిస్తే తమ భవిష్యత్తు ఏంటి? అని ప్రస్తుతం ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న చాలా మంది అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు. ఈ ఆర్మీ పథకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news