జనవరి నెలలో కరీంనగర్ – హైదరాబాద్ మధ్య రైల్వే ప్రయాణం ప్రారంభం !

-

వచ్చే జనవరి ఫిబ్రవరి వరకు కుకునూరుపల్లికి రైలు రాబోతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కుకునూరుపల్లికి రైలు వస్తే తిరుపతికి పోవచ్చు, అలాగే కరీంనగర్, హైదరాబాద్ పోవచ్చన్నారు. ఇవాళ కుకునూరుపల్లి ప్రజల కళ్ళల్లో బతుకమ్మ-దసరా పండుగ కలిసి వస్తే ఎంత సంతోషం ఉంటుందో అంత సంతోషం చూస్తున్నామని వెల్లడించారు.

రైల్వేశాఖ-ప్రయాణికులు
రైల్వేశాఖ-ప్రయాణికులు

సిద్దిపేట జిల్లా కుక్కునూరు పల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన తాసిల్దార్ కార్యాలయం మరియు జాయింట్ సబ్ రిజిస్టర్ ప్రారంభోత్సవం అయింది. కుకునూరుపల్లి మండలం ఏర్పాటు చేసుకున్నందుకు మండలాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్ సార్ కు ధన్యవాదాలు, ఇక్కడ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

30 ఏళ్ల పోరాటం 30 ఏళ్ల కల సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో ఫలించింది. కుకునూరుపల్లి మండల ఏర్పాటు అయ్యింది.15 గ్రామ పంచాయతీలతో 20 వేల జనాభాతో ఇవాళ కుకునూరుపల్లి మండలం ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాకపోయి ఉంటే సిద్దిపేట జిల్లా అయ్యేదా.. కుకునూరుపల్లి మండలం అయ్యేదా.. ఇదంతా కేవలం కేసీఆర్ గారి దృఢ సంకల్పం వల్లే సాధ్యమైందన్నారు హరీష్ రావు.

 

Read more RELATED
Recommended to you

Latest news