కాంగ్రెస్ గెలిచే సీట్లను మైక్రోస్కోప్ పెట్టి వెతుక్కోవాలి : PM మోడీ

-

వరంగల్ ప్రాంతం కాకతీయుల విజయ గౌరవానికి ప్రతీక అని ప్రధాని మోడీ కొనియాడారు. ఇవాళ వరంగల్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. 40 ఏళ్ల క్రితం బీజేపీకి ఇద్దరూ ఎంపీ లే ఉండేవారు. అందులో ఒకరు హన్మకొండ నుంచే గెలిచారని గుర్తు చేశారు ప్రధాని మోడీ. ఇక మూడు దశల ఎన్నికల్లోనే ఎన్టీఏ విజయం ఖాయమైపోయిందన్నారు మోడీ. నాలుగో విడుతలో కాంగ్రెస్ తాము గెలిచే సీట్లను మైక్రోస్కోప్ పెట్టి వెతుక్కోవాలని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలు వికసిత్ భారత్ కావాలని కోరుకుంటున్నారని చెప్పారు.

తెలంగాణ కోసం బలిదానం ఇచ్చిన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఎక్కడ అధికారంలో ఉంటే.. అక్కడ ఇండియా కూటమి ఆ రాష్ట్ర సంపదను ఏటీఎంలా వాడుకుంటుంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ హయాంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని.. చేయకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ బీజేపీ హయాంలో తాము 2014లో దళితుడిని రాష్ట్రపతిగా, 2019లో ఆదివాసి మహిళను రాష్ట్రపతిగా చేసినట్టు గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news