దైవ దర్శనానికి వచ్చి పూజారి బైక్ ఎత్తుకెళ్లిన దొంగ

-

దొంగతనం చేయడంలో ఒక్కొక్కడిది ఒక్కో స్టైల్.. ఒకడు ఎవరూ లేని టైమ్ చూసి స్కెచ్ వేస్తే..మరొకడు మిడ్ నైట్ ప్లాన్ చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం దైవదర్శనానికి వచ్చి ఏకంగా పూజారి బైక్ నే దొంగిలించాడు ఓ యువకుడు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగిన ఈ చోరీ చర్చనీయాంశంగా మారిందిి. దుబ్బాకలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర ఆలయంలో రోజు లాగే ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి తన బైక్ ఆలయం వద్ద పార్క్ చేసి హుండీ వద్ద బైక్ తాళాలు పెట్టి ఆయన పనిలో నిమగ్నమై పూజలు చేసుకుంటున్నాడు.

ఇది గమనించిన యువకుడు సోమవారం సాయంత్రం ఆలయానికి వచ్చి దేవున్ని దర్శించుకున్నాడు. ఆ యువకునికి తీర్థ ప్రసాదాలు అందజేసిన పూజారి..మంగళహారతి తీసుకొని గర్భగుడి లోపలికి వెళ్ళాడు. ఇదే అదునుగా భావించిన యువకుడు హుండీ దగ్గర ఉన్న బైక్ కీ తీసుకుని స్టార్ట్ చేసుకుని పారిపోయాడు. అనుమానం వచ్చి ఆలయం బయటకు వచ్చి చూడగా.. బైక్ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు పూజారి. రంగంలోకి దిగిన పోలీసులు సి సి ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news