టిఆర్ఎస్ నాయకుల్లారా మీకు కాస్తయినా సిగ్గుందా? – విజయశాంతి

-

ఇటీవల చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గుర్తు తెలియని వ్యక్తులు సమాధి నిర్మించారు. అయితే ఇది ముమ్మాటికీ టిఆర్ఎస్ నాయకుల పనేనని మండిపడ్డారు బిజెపి నేత విజయశాంతి. ఇంత దిక్కుమాలిన రాజకీయమా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో అత్యంత నీచ రాజకీయాన్ని చేస్తోంది. గెలవడమే పరమావధిగా పెట్టుకున్న టీఆర్ఎస్ మునుగోడులో చిత్రవిచిత్రమైన వేషాలు వేస్తోంది. అక్కడ ఒకవైపు డబ్బు, మద్యం పంచుతూ ప్రజలను ప్రలోభాలకు గురించి చేస్తూనే.. మరోవైపు భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తోంది.

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి సమాధిని ఈ టీఆర్ఎస్ నాయకులు కట్టారు. టీఆర్ఎస్ నాయకుల్లారా మీకు కాస్తాయినా సిగ్గుందా? విమర్శలకైనా కొంచెం హద్దు ఉండాలి. ఏం చేసినా కాస్త పద్ధతిగా మెలగాలి. మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి సమాధి కట్టడం ఎంతవరకు సమంజసం? ఆ సమాధి జేపీ నడ్డా గారిది కాదు, అది బిజెపికి మునుగోడులో గెలుపు పునాది కాబోతోంది. ఇదంతా చూస్తూ ప్రజలు ఊరుకోరు. ఈ ప్రజానీకమే మీకు తెలంగాణలో బొంద పెట్టి సమాధి కట్టడం ఖాయం”. అని సోషల్ మీడియా వేదిక ద్వారా మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news