బండి సంజయ్ కార్పొరేటర్ కు ఎక్కువ… ఎంపీకి తక్కువ: గువ్వల బాలరాజు

-

బండి సంజయ్ మతం వైపు కులం వైపు మళ్లించడం కాదని… పాలమూరు ప్రాజెక్ట్ కు ఎందుకు జాతీయ హోదా కల్పించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. బండి సంజయ్ పాదయాత్ర వెలవెలబోతోందని అందుకే సొమ్మసిల్లి పడిపోతున్నారని ఎద్దేవా చేశారు. ముందుగా బండి సంజయ్ మాట్లాడటం నేర్చుకోవాలని.. అంశాల మీద అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు. బండి సంజయ్ కార్పొరేటర్ కు ఎక్కువ ఎంపీకి తక్కువ అంటూ విమర్శలు చేశారు. కేంద్రం బీజేపేతర సర్కార్ ఉన్న రాష్ట్రాల మీద సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నాయని ఆరోపణలు చేశారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి దమ్ము ఉంటే దళిత బంధు వంటి పథకాలు తీసుకురావాలని సవాల్ చేశారు. మీ మత పిచ్చితో ప్రజలకు ఒరిగేదేం లేదని అన్నారు. దళితులపై బీజేపీ రాష్ట్రాల్లో దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. తెలంగాణ సెక్యులర్ స్టేట్ అని… మీ మత చిచ్చు తెలంగాణలో సాధ్యం కాదని అన్నారు. మా ముఖ్యమంత్రిని జైలుకు పంపిస్తా అని సంజయ్ అంటున్నారని… దమ్ముందా నీకు అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ ను తాకే దమ్ము ఉందా..? మీకు బీజేపీని సవాల్ చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు సీఎం కేసీఆర్ విశ్రమించబోరని గువ్వల బాలరాజు అన్నారు. రేవంత్ రెడ్డి పిచ్చికుక్కలా మారాడని విమర్శించాడు. పనికి రాని వెధవకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పచెప్పిందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news