కేటీఆర్ పబ్లిక్ సిటీ పిచ్చి పరాకాష్ఠకు చేరింది: జ్యోత్స్న

-

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ పబ్లిక్ సిటీ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని టీడీపీ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న విమర్శలు చేశారు. బిర్యానీ మీద స్పందించిన కేటీఆర్ కరోనా రోగుల ప్రశ్నలకు ట్వట్టర్‌లో స్పందించకపోవటం విడ్డూరమని ఆమె ఎద్దేవా చేశారు. ప్రైవేటు ఆసుపత్రులను కంట్రోల్ చేయటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ మరణిస్తే కూడా స్పందించటంలేదని మండిపడ్డారు. నీలోఫర్ హెడ్ నర్స్ స్వరూపారాణి మరణిస్తే ఎవరూ స్పందించలేదని జ్యోత్స్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉన్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఆరు స్టాఫ్ నర్స్ పోస్టులు మాత్రమే భర్తీ చేశారని పేర్కొన్నారు. కరోనా మరణాలపై తప్పడు లెక్కలు చూపుతున్నారని వ్యాఖ్యానించారు.. మహిళలపై గృహహింస కేసులు ఎక్కువయ్యాయని 👆🏻టీటీడీపీ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news