తెలంగాణలో పాలించే రాజు జాగ్రత్తగా ఉండాలి – పంచాంగం

-

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో పాలించే రాజు జాగ్రత్తగా ఉండాలని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పంచాంగ పఠనంలో పండితులు తెలిపారు. కొంతమంది కారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకతలు వస్తాయని చెప్పారు. ప్రభుత్వానికి కోర్టుల నుంచి అనుకూల తీర్పులు వస్తాయన్నారు. మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర ఘటనలు జరుగుతాయని పేర్కొన్నారు.

అలాగే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందింస్తుందని… అన్ని పనులు ఈ సంవత్సరం పూర్తవుతాయని వివరించారు.తెలంగాణ రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది… అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండుతాయి. జలవృద్ధి అధికంగా ఉంటుందని చెప్పారు.ఈ సంవత్సరం పాడిపంటలు అద్భుతంగా ఉంటాయని… విద్యావకాశాలు మెరుగు పడుతాయని పంచాంగం చెప్పారు. విద్య రంగం లో సమూలమైన మార్పులు వస్తాయన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది పంటలు బాగా పండుతాయి… ఈ సంవత్సరం విష జ్వరాలు, కరోనా వంటి వ్యాధులు రావని పంచాంగం చెప్పింది. మాస్క్ లేకుండా ప్రజలు తిరుగవచ్చు…తెలుగు సినీ ఇండస్ట్రీకి చాలా అద్భుతంగా ఉంటుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news