మెదక్ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి బాల్యన్ కి అవమానం

-

బ్రేకింగ్ : మెదక్ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి బాల్యన్ కి ఘోర అవమానం ఎదురైంది. కేంద్ర మంత్రి బాల్యన్ బస కోసం మెదక్ లో బిజెపి నేతలు ప్రభుత్వ గెస్ట్ హౌస్ బుక్ చేశారు. నిన్న పర్యటన ముగించుకుని రాత్రి గెస్ట్ హౌస్ కు వచ్చారు కేంద్ర మంత్రి బాల్యన్. అయితే… కేంద్ర మంత్రి బాల్యన్ కి అధికారులు.. గెస్ట్ హౌస్ బుక్ చేసిన తాళాలు ఇవ్వలేదు.

దీంతో గంటసేపు గెస్ట్ హౌస్ బయటే నిల్చున్నారు కేంద్ర మంత్రి బాల్యన్. తాళం కోసం అధికారులకు కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు అధికారులు. అటు ఆగ్రహంతో గెస్ట్ హౌస్ తాళాలు పగలగొట్టారు బిజెపి పార్టీ కార్యకర్తలు. కేసీఆర్‌ సర్కార్‌ బీజేపీ నాయకుల పట్ల అవమానకరంగా వ్యవహరిస్తుందంటూ.. నిప్పులు చెరిగారు బీజేపీ పార్టీ నాయకులు. ప్రస్తుతం ఈ సంఘటన హాట్‌ టాపిక్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news