క్వారంటైన్ పేరుతో ఏ స్కామ్ కు స్కెచ్ వేస్తున్నారో? – బండి సంజయ్

-

క్వారంటైన్ పేరుతో ఏ స్కాంకు స్కెచ్ వేస్తున్నారో? అని ఎద్దేవా చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. లిక్కర్ సహా అన్ని స్కామ్ లలో కేసీఆర్ కుటుంబమే ఉందని ఆరోపించారు. ఉప్పల్ నియోజకవర్గం లో బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతోంది. ఉప్పల్ సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బండి సంజయ్ ప్రసంగం సాగుతోంది. ఈనెల 22న పెద్ద అంబర్పేట్ లో జరిగే భారీ బహిరంగ సభకు తరలి రావాలంటూ పిలుపునిచ్చారు బండి సంజయ్.

ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. “కేసీఆర్…ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే పురుగులు పడి పోతావ్” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా బీజేపీపై నెపం నెట్టి సుప్రీంకు వెళ్లి స్టే తేవాలని టీఆర్ఎస్ స్కెచ్ వేస్తోందన్నారు. దమ్ముంటే.. ఎస్టీ రిజర్వేషన్ల అమలుపై ప్రమాణం చేద్దాం రా… అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ తో కలిసి ద్రౌపది ముర్మును ఓడగొట్టేందుకు యత్నించి కేసీఆర్ ఎస్టీల గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోని ఏకైక సీఎం కేసీఆరే అన్నారు. తడిబట్టతో గొంతు కోసే మూర్ఖుడు కేసీఆర్ అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news