ఇష్టంలేని పెళ్లి చేశారని..యువతి ఆత్మహత్య

-

ఇటీవలికాలంలో ఇష్టం లేని పెళ్లి చేస్తున్న కారణంగా ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పిల్లలను ఎంతో అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులు ఎందుకో పెళ్లి విషయంలో మాత్రం తీరును మార్చుకోవడం లేదు. చివరికి బలవంతంగా పెళ్ళిళ్ళు చేసి పిల్లల బలవన్మరణాలకు కారణం అవుతున్నారు.ఓ యువతికి ఇష్టం లేకుండా పెళ్లి చేశారని చివరికి ఆత్మహత్య చేసుకుంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల కి చెందిన బీరయ్య కు ముగ్గురు కుమార్తెలు.కాగా మూడో కూతురు చామంతి కి జగదేవ్పూర్ మండలం చాట్లపల్లి కి చెందిన సంజీవులు కు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు బీరయ్య

అయితే అప్పటికే సంజీవ్ కు పెళ్లి జరిగి భార్య చనిపోయింది. దీంతో అతనికి రెండో భార్య కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని భావించాడు తండ్రి. అయితే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన సదరు యువతి తనకు ఇష్టం లేని పెళ్లి చేశారు అంటూ ప్రతిరోజు కుంగిపోతూ ఉండేది. ఇటీవలే ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. చివరికి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

Read more RELATED
Recommended to you

Latest news