అసలు మీ అన్న పాలించే రాష్ట్రంలో కరెంట్ ఉందా ? – మాజీ ఎంపీ వినోద్

-

వైఎస్‌ షర్మిలను టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు టార్గెట్‌ చేశారు. షర్మిల అరెస్ట్‌ నేపథ్యంలో.. టీఆర్‌ఎస్‌ కౌంటర్‌ వ్యాఖ్యలు చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే… వైఎస్‌ షర్మిలపై టిఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేయడంలో అర్థం లేదని, ఆంధ్రలో చేసుకోవాలని టిఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. బిజెపి వదిలిన బాణం షర్మిల అని ఆరోపించారు. షర్మిలకు ఇక్కడ అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ‘ఇక్కడ నిమిషమైనా కరెంటు పోతుందా? మీ అన్న పాలించే ప్రాంతంలో అసలు కరెంట్ ఉందా? షర్మిల వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి’ అని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news