హీరోయిన్ త్రిష వివాహం క్యాన్సిల్ కావడానికి కారణం అదేనట..!!

-

తెలుగు సినిమా హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో తక్కువ సినిమాలో నటిస్తున్నప్పటికీ.. గతంలో మంచి నటిగా పేరుపొందింది. మొదటగా తరుణ్ హీరోగా వచ్చిన నీ మనసు నాకు తెలుసు వంటి సినిమాతో హీరోయిన్గా మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయ్యింది త్రిష. ఆ తర్వాత ప్రభాస్ తో నటించిన వర్షం చిత్రం ద్వారా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దీంతో తర్వాత మహేష్ తో అతడు, చిరు తో స్టాలిన్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. తదితర సినిమాలలో నటించి బాగానే తెలుగు ఇండస్ట్రీలో పేరు దక్కించుకుంది కానీ ఆ తర్వాత తమిళంలో వరుసగా సినిమాలు చేసి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది.త్రిష ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికీ 20 సంవత్సరాలు పైన కావస్తున్న ఈమె క్రేజ్ మాత్రం ఇంకా తగ్గడం లేదని చెప్పవచ్చు.. తనకు ప్రాధాన్యత ఉండే సినిమాలలో నటిస్తూ అభిమానులకు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటోంది. ఇక తన పర్సనల్ లైఫ్ జీవితానికి సంబంధించి కూడా పలుసార్లు వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. గతంలో ఒకసారి బిజినెస్ మ్యాన్ వరుణ్ మానియాన్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని బయట పెట్టింది త్రిష.

ఈ విషయంపై త్రిష స్పందిస్తూ వివాహం తర్వాత సినిమాలలో నటిస్తానంటే తను ఒప్పుకోలేదట అందుచేతనే వివాహాన్ని రద్దు చేసుకున్నారని తెలియజేసినట్లు సమాచారం. వివాహం తర్వాత తను నటిస్తాను అంటే ఒప్పుకునే వ్యక్తిని వివాహం చేసుకుంటానని.. ప్రెగ్నెంట్ అయిన తర్వాత మాత్రం బ్రేక్ ఇస్తానని .. మిగతా సమయంలో మాత్రం ఎక్కువగా నటిస్తూనే ఉంటానని తెలియజేసింది. చివరి వరకు తను సినిమాలలో నటిస్తూనే ఉంటానని తన మాటలను బయట పెట్టింది త్రిష. దీంతో త్రిష విషయం మరొకసారి కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారుతుంది. అయితే త్వరలోనే తన వివాహం గురించి ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news