మూగ యువతిపై బంధువు అత్యాచారం

-

ఇంట్లో ఒంటరిగా ఉన్న మానసిక దివ్యాంగురాలు పై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టుకతో మూగ, చెవుడు ఐన మానసిక దివ్యాంగురాలు(25) పై కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన నూతి ఏడుకొండలు (45) ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి ఒడిగట్టాడు. ఏడుకొండలు ఆ యువతికి దూరపు బంధువు అవుతారని పోలీసులు వెల్లడించారు. శాలిగౌరారం మండలం లోని ఆకారం గ్రామానికి చెందిన కౌలు రైతు కుటుంబం నిమ్మ తోటను కౌలుకు తీసుకుని తోటలో నివాసం ఉంటున్నారు.

మూగ యువతి తల్లిదండ్రులు శుక్రవారం శుభకార్యానికి వేరే ఊరు వెళ్లారు. ఆ యువతి( 25)నిమ్మ తోటలోని నివాస గృహంలో ఒంటరిగా ఉంది. యువతి బంధువు కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన ఏడుకొండలు ఓ పని నిమిత్తం యువతి ఇంటికి వచ్చాడు. ఒంటరిగా ఉండడం తో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి కి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చిన తన కుటుంబ సభ్యులకు జరిగిన ఘోరాన్ని వివరించి బోరున విలపించింది యువతి. శుక్రవారం రాత్రి బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని శాలిగౌరారం ఎస్ఐ సతీష్ తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం నకిరేకల్ ప్రభుత్వ వైద్యశాలకు పంపించామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news