కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం….స్కూళ్లలో రోజుకు 3 సార్లు వాటర్ బెల్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఎండలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును తప్పించేందుకు పాఠశాలల్లో మూడు సార్లు వాటర్ బెల్ కొట్టాలని ఆదేశించింది. ఉదయం 8.45, 10.05, 11.50 గంటలకు బెల్ కొట్టాలని సూచించింది. విద్యార్థులు క్రమం తప్పకుండా మంచి నీటిని తాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఒంటి పూట బడులు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version