పేద ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం – దానం నాగేందర్

-

పేద ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఖైరతాబాద్ నియోజకవర్గం జూబ్లీహిల్స్ లోని ఫిలింనగర్ లో నూతన పెన్షన్ ల మంజూరు పత్రాలను అందజేసారు ఎమ్మెల్యే దానం నాగేందర్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు 200 రూపాయలు ఉన్న పెన్షన్ ను ముఖ్యమంత్రి కెసిఆర్ రూ. 2016 రూపాయల కు పెంచారని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి పెన్షన్ లు అందుతున్నాయని అన్నారు.

57 సంవత్సరాలు దాటిన మరో 10 లక్షల మందికి వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 15 నుండి అందిస్తున్నామని అన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపడుచు పెండ్లికి లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news