ఈటెల ఎవరెవరికి ఫోన్లు చేసి బతిమాలుతున్నాడో సమాచారం ఉంది: ఎమ్మెల్యే జాజుల

-

ఈటెల రాజేందర్ ఎవరెవరికి ఫోన్లు చేసి బతిమాలుతున్నాడో మా దగ్గర పూర్తి సమాచారం ఉందన్నారు ఎమ్మెల్యే జాజుల సురేందర్. ఆయన ఈటెల రాజేందర్ కాదు.. ఆయన ఈటెల రాజేందర్ రెడ్డి అని అన్నారు.ఈటెల ఆధార్ కార్డులో సందర్భాన్ని బట్టి తన పేరును రెడ్డి గా పెట్టుకున్నారని అన్నారు. హుజూరా బాద్ లో మళ్లీ ఈటెల గెలవడం అసాధ్యమని అన్నారు జాజుల.తన సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని ఈటెల కుట్ర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈటెల ముందు గజ్వెల్ రావడం కాదు హుజురాబాద్ ప్రజల బాగోగులు చూసుకుంటే మంచిదని హితవు పలికారు.ఈటెల నోరు జారితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.అలాగే ప్రభుత్వ విప్ ఎం.ఎస్. ప్రభాకర్ రావు మాట్లాడుతూ..ఈటెల రాజేందర్ ఓ పెద్ద బ్రోకర్ లా మారాడని అన్నారు.వచ్చే ఎన్నికల్లో ఈటెల కూడా డిపాజిట్ కోల్పోవడం ఖాయమని జోష్యం చెప్పారు.ఈటెల నోరు అదుపులో పెట్టుకోవాలని,బీజేపీ తెలంగాణ లో గెలవడం అసాధ్యమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version