కేఏ పాల్ కు పవన్ కళ్యాణ్ కు తేడా లేదు – మంత్రి జోగి రమేష్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కి ఏమీ తేడా లేదనిి అన్నారు ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. ఆదివారం తాడేపల్లిలో మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. అటు కేఏ పాల్ కి, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరికీ ఏపీలో సీట్లు లేవని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి 175 నియోజకవర్గాలలో ఓటమి తప్పదని అన్నారు మంత్రి జోగి రమేష్.

jogi ramesh

ఏపీలో టీడీపీ పై తిరుగుబాటు మొదలైందని అన్నారు. ఈ తిరుగుబాటు కుప్పంలో బీసీల నుంచే ప్రారంభమైందని.. చంద్రబాబు జెండాను, ఆ పార్టీని కూకటి వేర్లతో పేకిలించడానికి ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలోనే అభివృద్ధి చేయలేదనిదని.. ఇక రాష్ట్రానికి ఏం చేస్తావ్? అంటూ ప్రశ్నించారు. తండ్రీ కొడుకులను నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారని అన్నారు మంత్రి జోగి రమేష్.

Read more RELATED
Recommended to you

Latest news