హైదరాబాద్ నగర శివారులో కాల్పుల కలకలం.. గాల్లోకి కాల్పులు జరిపిన TRSV నాయకులు

-

స్వతంత్ర దినోత్సవం రోజు నగర శివారు ప్రాంతంలో ఫైరింగ్ కలకలం రేపింది. రాచకొండ మీర్జంపేట్ గెస్ట్ హౌస్ లో టిఆర్ఎస్ నాయకలు గన్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. టిఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ విగ్నేశ్వర్ రెడ్డి, విక్రమ్ గన్ తో గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ ఫైరింగ్ దృశ్యాలను వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నారు టిఆర్ఎస్ నాయకులు. దీంతో ఈ
విషయం వెలుగు చూసింది.

అయితే ఇది ఒరిజినల్ గన్ ఏనా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా టిఆర్ఎస్వి నాయకులు జోష్ రవీందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో కాల్పులు జరిపారు అంటూ ప్రచారం సాగుతుంది. ఈ పుట్టినరోజు వేడుకలకు టిఆర్ఎస్ బడా నాయకులు కూడా హాజరైనట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news