సుకన్య సమృద్ధి యోజన పథకంలో మారిన రూల్స్ ఇవే..!!

-

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో ఒకటి సుకన్య సమృద్ధి యోజన..ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లొకి తీసుకొచ్చింది.. అమ్మాయిల చదువు, పెళ్ళి కోసం పొదుపు చెయ్యాలని అనుకోనేవారికి ఈ స్కీమ్ బెస్ట్ అనే చెప్పాలి.పథకం కింద పెట్టుబడి పెడితే ఆడ పిల్లల భవిష్యత్తుకు అవసరమైన పూర్తి భరోసా అందివస్తుంది. అయితే ఈ పథకంలో తాజాగా రూల్స్ మారాయి.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం వడ్డీ రేట్లలో కీలక మార్పులు తీసుకొచ్చింది. అదేంటంటే.. సుకన్య సమృద్ది యోజన పథకం కింద మీ అమ్మాయి పేరు మీద రోజుకు రూ.416లు పొదుపు చేస్తే మీ అమ్మాయికి 21 ఏళ్లు వచ్చేటప్పటికీ ఆ డబ్బు రూ.65 లక్షలవుతాయి. పొదుపు చేసిన డబ్బుకు వచ్చే వడ్డీ ప్రతి ఆర్థిక సంవత్సరం చివర్లో ఖాతాలో క్రెడిట్ అయ్యే వెలుసుబాటు ఉంది.

అంతేకాకుండా గతంలోనైతే మీ కుమార్తెకు పదేళ్ల వయస్సు వస్తేగానీ అకౌంట్‌లో డబ్బు తీయడానికి అవకాశం ఉండేది. ఐతే తాజా నిబంధనల ప్రకారం 18 యేళ్ల వరకు అకౌంట్‌ను కదిలించడానికి వీలులేదు. సుకన్య సమృద్ది యోజన పథకం కింద ఒక కుటుంబంలో ఇద్దరు కుమార్తెల ఖాతాలకు మాత్రమే ట్యాక్స్‌ మినహాయింపు ఉండేది. ప్రస్తుతం కొత్త నియమాల ప్రకారం తొలుత ఆడపిల్ల పుట్టిన తర్వాత రెండోసారి అమ్మాయిలు కవలలుగా పుడితే వారికి కూడా సుకన్య సమృద్ది యోజన పథకం కింద ఖాతా తెరచుకోవచ్చు. ఏడాదికి కనీసం రూ.250లు జమ చేయాలి. అలా చేయని పక్షంలో అకౌంట్‌ డీయాక్టివేట్‌ అవుతుంది. రెండోసారి యాక్టివ్‌ చేసుకోకపోతే అప్పటి వరకు ఖాతాలో జమ చేసిన మొత్తంపై మెచ్యూరిటీ పూర్తీ అయ్యాక అంతే వడ్డీ వస్తుంది. అందుకే ఈ పథకంలో పొదుపు చెయ్యడం ముఖ్యం..పెద్ద మొత్తం రావాలంటే మాత్రం స్కీమ్ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news