వాళ్లు నన్ను చంపేసేవారు – రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

-

లండన్ లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో శుక్రవారం 21వ శతాబ్దంలో బోధనలు అనే అంశంపై వర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రకి సంబంధించిన కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు. రాహుల్ గాంధీ దాదాపు 5 నెలల పాటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.

అయితే ఆయన పాదయాత్ర జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న సమయంలో ఓ భయానక అనుభవం ఎదురయిందట. ఆ సమయంలో ఉగ్రవాదులు తనని చంపేసేవారేనని అన్నారు. ” జమ్మూ కాశ్మీర్ లో పాదయాత్ర జరుగుతున్న సమయంలో ఓసారి గుర్తు తెలియని వ్యక్తి నా దగ్గరకు వచ్చారు. వచ్చి నిజంగానే ఇక్కడ ప్రజల కష్టాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అని నన్ను ప్రశ్నించాడు. ఆ తర్వాత కొంతసేపటికి ఆ వ్యక్తి దూరంగా ఉన్న కొంతమందిని చూపిస్తూ వాళ్లంతా ఉగ్రవాదులు అని చెప్పాడు. నేను ఉన్న ఆ పరిస్థితుల్లో వారు నన్ను చంపేసేవారు” అని గుర్తు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news