బాలనటిగా, కథానాయికగా బాలయ్యతో నటించిన ఈ హీరోయిన్ మీకు తెలుసా?

-

నందమూరి నటసింహం బాలయ్య ప్రజెంట్ తన 107వ చిత్ర షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ పిక్చర్ తెరకెక్కుతోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఇందులో విలన్ రోల్ ప్లే చేస్తుండగా, హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ..తన కెరీర్ లో ఇప్పటికే అన్ని రకాల పాత్రలు పోషించారు. జానపద, సాంఘీక, సైన్స్ ఫిక్షన్ తో పాటు చారిత్రక పాత్రలను కూడా పోషించారు. ఈ సంగతులు పక్కనబెడితే..బాలయ్య చిత్రంలో బాలనటిగా నటించిన ఓ అమ్మాయి. ఆ తర్వాత కాలంలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటించింది. ఆమె ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

బాలయ్య, సుహాసిని హీరో, హీరోయిన్లుగా నటించిన ‘మంగమ్మ గారి మనవడు’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ విదితమే. ఈ చిత్రంతో బాలయ్య తనకంటూ అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత ఈ తరహా పాత్రలనూ బాలయ్య పోషించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ పిక్చర్ లో బాలనటిగా కనిపించిన ఓ అనాథ..అమ్మాయి ఆ తర్వాత కాలంలో హీరోయిన్ అయింది. ఆమెనే రాశి.

తన తండ్రి ప్రోత్సాహంతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన రాశి..బాలనటిగా పలు సినిమాలు చేసిందట. ఆ తర్వాత హీరోయిన్ గా తమిళ్ లో ఇంట్రడ్యూస్ అయింది. ఆ తర్వాత తెలుగులోనూ సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే బాలయ్య చిత్రంలో బాలనటిగా నటించిన రాశి..ఆయన సరసన హీరోయిన్ గా నటించింది.

‘కృష్ణబాబు’ చిత్రంలో కథానాయికగా నటించింది రాశి. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. అలా అరుదైన సంఘటన రాశి విషయంలో జరిగిందని చెప్పొచ్చు. రాశి..ఆ తర్వాత కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ప్రజెంట్ రాశి సెకండ్ ఇన్నింగ్స్ లో సపోర్టింగ్ రోల్స్ సినిమాల్లో ప్లే చేస్తోంది. ఈ క్రమంలోనే డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసి సీరియల్స్ లోనూ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version