BREAKING : ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి

-

హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ లో దారుణం చోటుచేసుకుంది. హైటెక్ సిటీ- హఫీజ్ పేట్ ఎంఎంటీఎస్ రైలు మార్గంలో ముగ్గురు వ్యక్తులను రైలు ఢీకొట్టింది. వారంతా రైల్వే ట్రాక్  దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

విషయం తెలుసుకున్న నాంపల్లి రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హఫీజ్ పేట్ సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో డీప్ కర్వ్ ఉండటంతో వీరు రైలును గుర్తించలేకపోయారని తెలిపారు.

మృతులు రాజప్ప, శ్రీను, కృష్ణగా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు వనపర్తి వాసులని చెప్పారు. నగరంలో సంకల్ప్ అపార్ట్మెంట్ సమీపంలో నివసిస్తున్నట్లు తెలిపారు. ఈ ముగ్గురు రోజు వారి కూలీ పనులు చేసుకుంటూ నగరంలో జీవనం సాగిస్తున్నారని వెల్లడించారు. వీరి మరణం గురించి కుటుంబాలకు సమాచారం అందించినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news