పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

-

పల్నాడు జిల్లా నకిరేకల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శాంతిపురం రహదారిపై ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. నాపరాల్లతో వెళుతున్న ఆ లారీ అదుపుతప్పి బోల్తా పడడంతో.. లారీలో ఉన్న ముగ్గురు కూలీలు దుర్మరణం చెందారు. మాచర్ల నుంచి భీమవరం వెళుతున్న నాపరాల్ల లారీ సరిగా శాంతినగర్ వద్దకు రాగానే అదుపుతప్పి కింద పడింది.

మృతిచెందినన కూలీలలో పసర్ల పాడుకు చెందిన ఆమరేసు శీను, దొడ్డ భాస్కరరావు, రమావత్ ముని నాయక్ గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news