Breaking : 17 బ్యాంక్‌లను ముంచిన ముగ్గురు వ్యాపారవేత్తలు..

-

బ్యాంకుల‌ను బురిడీ కొట్టిస్తున్న వ్యాపార సంస్థ‌ల జాబితాలో మ‌రో పెద్ద సంస్థ చేరిపోయింది. దేశంలో బ్యాంకుల‌ను మోస‌గించిన కేసుల‌కు సంబంధించిన సీబీఐ న‌మోదు చేసిన కేసుల్లో అతి పెద్ద‌ కేసుగా దీనిని ప‌రిగ‌ణిస్తున్నారు. ఈ కేసులో ప్ర‌ముఖ రియ‌ల్టీ సంస్థ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్‌)పై బుధ‌వారం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ కేసు న‌మోదు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్‌తో పాటు ఆ సంస్థ మాజీ ప్ర‌మోట‌ర్లు క‌పిల్ వాద్వాన్‌, ధీర‌జ్ వాద్వాన్‌లపై కేసు నమోదు చేసింది. అంతేకాకుండా ఈ మోసంలో భాగం ఉంద‌న్న ఆరోప‌ణ‌ల‌తో అమ‌రిల్లీస్ రియ‌ల్ట‌ర్స్‌కు చెందిన సుధాక‌ర్ శెట్టితో పాటు మ‌రో ఆరుగురు బిల్డ‌ర్ల‌పైనా సీబీఐ కేసులు న‌మోదు చేసింది.

In Biggest Bank Fraud Probed By CBI, Raids On DHFL Ex-Promoters

ప్ర‌భుత్వ రంగ బ్యాంకు యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) నేతృత్వంలోని 17 బ్యాంకుల క‌న్సార్టియం నుంచి 2010 నుంచి 2018 వ‌ర‌కు విడ‌త‌ల వారీగా డీహెచ్ఎల్ఎఫ్ రూ.42,871 కోట్ల‌ను రుణాలుగా తీసుకుంది. అందులో కొత్త మొత్తాన్ని చెల్లించిన ఆ సంస్థ ఇంకా బ్యాంకుల క‌న్సార్టియానికి రూ.34,615 కోట్లు బ‌కాయి ఉంది. 2019 నుంచి బ‌కాయిల‌ను చెల్లించ‌డం మానేసిన‌ డీహెచ్ఎఫ్ఎల్‌పై సీబీఐ అధికారుల‌కు యూబీఐ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సీబీఐ బుధ‌వారం ముంబైలోని సంస్థ కార్యాల‌యాల‌తో పాటు ప‌లు చోట్ల సోదాలు చేప‌ట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news