మగువలకు షాక్‌.. పెరిగిన బంగారం ధరలు..

-

బంగారం, వెండి కొనాలనుకునేవారికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. రేట్లు తగ్గాయనుకునేలోపే మళ్లీ పెరుగుతున్నాయి. అలానే ఆగట్లేదు. వరుసగా ధరలు పైకి ఎగబాకుతున్నాయి. ఇక వెండి ధరలైతే భారీగా పెరిగాయి. కిలో వెండిపై రూ.1000 పెరగడం గమనార్హం. మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.49,850కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,380గా ఉంది. అలాగే మారిన ధరలతో బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 71,100 గా పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,380 పలుకుతోంది. విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380 కులభిస్తోంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,410 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,400వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,530 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850 పలుకుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380ఉంది. ఇక పెరిగిన ధరలతో దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి రేట్లు ఇలా ఉన్నాయి. చైన్నైలో కిలో వెండి ధర రూ.74,000, ముంబైలో రూ.71,100, ఢిల్లీలో రూ.71,100, హైదరాబాద్‌లో రూ.74,000, కోల్‌కతాలో రూ.71,100, బెంగళూరులో రూ.74,000, విజయవాడలో రూ.74,000 పలుకుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version