రేపటి సీఎం భేటీకి చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్…!

-

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ రాబోతోందని తెలుస్తోంది. రేపటితో టికెట్ ధరల అంశానికి ముగింపు రానున్నట్లు తెలుస్తోంది. రేపు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవితో పాటు మరికొంత మంది అగ్రహీరోలు, నిర్మాతలు కూడా భేటీ కానున్నట్లు సమాచారం. భేటీకి చిరంజీవితో స్టార్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్ కూడా హాజరవుతున్నట్లు సమాచారం వస్తోంది. వీరితో పాటు దర్శకులు రాజమౌళి, కొరటాల శివ కూడా ఈ భేటికి హాజరుకానున్నారు. పెద్ద సినిమాల రిలీజ్ మంచుకొస్తున్న నేపథ్యంలో సీఎంతో చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

తాజాగా ఈరోజు మళ్లీ ఏపీ మంత్రి పేర్నినాని సీఎం జగన్ తో భేటీ అయ్యారు. కమిటీ ప్రతిపాదనలను కూడా జగన్ ముందు నాని పెట్టినట్లు తెలుస్తోంది. దీంట్లో కూడా టికెట్ ధరలను పెంచితేనే మంచిదని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో రేపటి సీఎం భేటీ తరువాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సినీ ప్రముఖులు జగన్ తో భేటీ కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news