రాజకీయాల్లోకి నటి త్రిష.. కాంగ్రెస్‌ నుంచి ఆఫర్లు..

-

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించిన త్రిష కృష్ణన్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం త్రిష ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమలో అవకాశాలు సన్నగిల్లుతుండడంతో ఆమె ఇప్పుడు రాజకీయాలపై దృష్టి సారించినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ఆమెకు ఆహ్వానం అందినట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం తమిళనాట రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ప్రముఖులను పార్టీల్లో చేర్చుకోవడం ద్వారా గ్లామర్ లుక్ తీసుకురావాలని పార్టీలన్నీ యోచిస్తున్నాయి.

രാഷ്ട്രീയത്തില്‍ ഒരുകൈ നോക്കാന്‍ തൃഷ; കോണ്‍ഗ്രസില്‍ ചേര്‍ന്നേക്കുമെന്ന്  സൂചന, Actress Trisha

అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ త్రిషను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో సీనియర్ నటి ఖుష్బూ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. దీంతో ఇప్పుడామె లేని లోటును త్రిష ద్వారా తీర్చాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు సీనియర్ నేతలు ఇటీవల త్రిష ఇంటికి వెళ్లి మంతనాలు జరిపినట్టు తమిళ వెబ్‌ సైట్లు కొన్ని కథనాలు రాశాయి. మరోవైపు, తమిళనాడులో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ కూడా త్రిష వైపే చూస్తున్నట్టు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news