టిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫార్మ్ హౌస్ ఆడియో లీక్

-

తెలంగాణలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన బేర సారాల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన బేర సారాల ఆడియోలను అధికార టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, రామచంద్ర భారతి మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు ఈ ఆడియోలో తెలుస్తోంది. రామచంద్ర భారతి మాట్లాడుతూ.. పార్టీలోకి రావడానికి నేను అన్నీ క్లియర్ చేస్తాను.

ఈడి, సిబిఐ దాడులు జరగకుండాండా చూసుకుంటాను. హైదరాబాదులో కాకుండా వేరే రాష్ట్రంలో చర్చిద్దాం అని అన్నారు. దీనికి పైలెట్ రోహిత్ రెడ్డి బదిలిస్తూ.. నాతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడాా వస్తారు. కెసిఆర్ కి తెలిస్తే మా జీవితాలు నాశనమవుతాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అని వీరి ఇరువురి మధ్య జరిగిన ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ ఈ ఆడియోలో రామచంద్ర భారతి ఎక్కడ కూడా ఫలానా పార్టీ అని చెప్పలేదు.

Read more RELATED
Recommended to you

Latest news