తెలంగాణ మంత్రి సత్యవతికి షాక్..కాన్వాయ్ ని అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు

-

తెలంగాణ మంత్రి సత్యవతికు ఊహించని షాక్‌ తగిలింది. ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సత్యవతి రాథోడ్‌ ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ రోజు ములుగు జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి సత్యవతి రాథోడ్ ను గట్టమ్మ దేవాలయ సమీపంలో ములుగు జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎస్సి సెల్ ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ ని అడ్డుకున్నారు.

టిఆర్ఎస్ కార్యకర్తలకు దళిత బందు ఇవ్వని మంత్రులు నేతలు ములుగు గడ్డ పైన అడుగు పెట్టొద్దంటూ నినాదాలు చేశారు. జడ్పీ చైర్మ న్ కుసుమ జగదీష్, మంత్రి సత్యవతి రాథోడ్ కాళ్ళు పట్టుకొని దళితుల న్యాయం చేయాలని వేడుకు న్నారు టిఆర్ఎస్ కార్యకర్తలు. ఎంపీ కవిత కార్యకర్తలను ఏమి చేసింది… మంత్రిగా మీరు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు. ఉమ్మడి జిల్లా మంత్రులు నేతలు దళిత బందు మంజూరులో ములుగు ఎమ్మెల్యేకు సహకరించడం ఏంటి అంటూ నిలదీశారు కార్యకర్తలు.

Read more RELATED
Recommended to you

Latest news