పవన్ 62 ఎకరాల భూమి వెనక అసలు నిజం ఏది ?

-

రాజధాని అమరావతి విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొండిగా వ్యవహరించడం పట్ల ఆయనకు కూడా రాజధాని ప్రాంతంలో భూములు ఉన్నాయని ఇటీవల ఓ ప్రముఖ టీవీ చానల్లో వైసిపి పార్టీకి చెందిన అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కి రాజధాని ప్రాంతంలో తనపై మరియు అదే విధంగా తన తల్లిపై 62 ఎకరాల భూములు కొనుగోలు చేయడం జరిగిందని వాటి విలువ రెండు కోట్ల 40 లక్షల 46 వేల ఉంటుందని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ డిబేట్ లో ఆధారాలతో సహా చూపించడం జరిగింది.

Image result for amaravathi pawan land documents

దీంతో వెంటనే యాంకర్ వాటిని చూసి డాక్యుమెంట్లు వివరాలు అన్ని వాస్తవమేనా కానీ వైసిపి పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి అని ప్రశ్నించగా వాటి వివరాలు మీకు కూడా పంపిస్తున్నాను చూసుకోండి అంటూ అన్ని వివరాలు బయట పెట్టారు. సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. ఇందు మూలంగానే పవన్ కళ్యాణ్ అమరావతి శాశ్వత రాజధాని అంటూ గట్టిగా గట్టిగా కామెంటు చేస్తున్నారని రవిచంద్రారెడ్డి పేర్కొన్నాడు.

 

అయితే పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు కొనడం నిజమే అయితే పవన్ కళ్యాణ్ కి రాజకీయంగా కష్టకాలం స్టార్ట్ అయినట్లు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోపక్క జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు రవిచంద్ర రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఫోటోషాప్ చేసి డాక్యుమెంట్లు సృష్టించి పవన్ పై బురద జల్లుతున్నారని కౌంటర్లు వేస్తున్నారు. దీంతో ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తే గాని అసలు మేటర్ బయటపడదు.

Read more RELATED
Recommended to you

Latest news