అలర్ట్: మే 17న పాలీసెట్.. నిముషం లేట్ అయినా నో ఎంట్రీ!

-

తెలంగాణ రాష్ట్రంలో మే 17వ తేదీన జరగనున్న పాలీసెట్ ఎంట్రన్స్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పరీక్షలు నిర్వహించు కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లను చేసి ఉన్నారు. ఈ సందర్భంగా పాలీసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కొన్ని కీలక నియమనిబంధనలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. పరీక్షను జరిపించడానికి మొత్తం 296 కేంద్రాలను సిద్ధం చేశారు, ఈ పరీక్షకు రాష్ట్రము నుండి మొత్తం 105656 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్ష సమయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 .30 గంటల వరకు ఉండనుంది.

ఈ పరీక్షలో లభించిన ర్యాంకు ద్వారా విద్యార్థులు ప్రభుత్వ మరియు ప్రయివేట్ పాలిటెక్నిక్ కాలేజీలలో ఇంజినీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్ కోర్స్ లలో ప్రవేశాలను తెచుకోనున్నారు. అయితే ఈ పరీక్షకు సరిగ్గా సమయానికి హాజరు కావలెనని బోర్డు తెలిపింది. ఒక్క క్షణం ఆలస్యం అయినా పరీక్ష హాల్ లోకి అనుమతించరట.

Read more RELATED
Recommended to you

Latest news