TSPSC Group 1 : గ్రూప్-1 కటాఫ్ మార్కులపై TSPSC కీలక ప్రకటన

-

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కటాఫ్ మార్కులపై తీవ్ర గంధర గోళం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే… గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కటాఫ్ మార్కులపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై టిఎస్పిఎస్సి స్పష్టత ఇచ్చింది.

ప్రిలిమినరీ పరీక్షలో కనీస అర్హత మార్కులు ఉండవని ప్రకటించింది. ప్రిలీమినరీ పరీక్ష కేవలం వడబోత పరీక్ష మాత్రమేనని తెలిపింది. మెయిన్స్ కు అభ్యర్థుల ఎంపిక విధానంలో మార్పులు జరిగాయని వివరించింది.

గతంలో మార్కుల ప్రాతిపదికన ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేసే విధానం ఉండేదని పేర్కొంది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 25న ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం, మల్టీజోన్ వారిగా రిజర్వేషన్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్స్ కు ఎంపిక చేస్తామని టిఎస్పిఎస్సి తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news