శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. రేపు ఆన్‌లైన్‌లో టికెట్లు

-

శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం వెల్లడించింది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ ఈ నెల 13న విడుదల చేయనుంది. ఈ నెల 22 నుంచి 28 వరకు ప్రత్యేక దర్శనాలకు సంబంధించి ఈ టికెట్లు విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో ఉంచుతామని పేర్కొంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో బాలాలయం వాయిదా పడడంతో, ఆ మేరకు ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేస్తున్నట్టు వివరించింది.

ఇక, అంగప్రదక్షిణం టికెట్లను టీటీడీ రేపు విడుదల చేయనుంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31 వరకు వర్తించే ఈ అంగప్రదక్షిణం టికెట్లను రేపు (ఫిబ్రవరి 11) ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో ఉంచనున్నారు. https://tirupatibalaji.ap.gov.in/ వెబ్ సైట్ లో కానీ, TT Devasthanams యాప్ ద్వారా కానీ ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news