బుల్లితెర నటుడు సమీర్ శర్మ మృతి..!

-

ఇటీవలే బాలీవుడ్ లో వరుసగా మరణాలు ఎంతో మంది అభిమానులను విషాదంలో నెడుతున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్… మరణం సంచలనం సృష్టించింది.. ఆ తర్వాత సుశాంత్ ది హత్య అని ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా హిందీ సీరియల్ నటుడు సమీర్ శర్మ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బుల్లితెర నటుడిగా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సమీర్ aశర్మ… అనుమానాస్పద స్థితిలో మృతి ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది.

ముంబై పరిధిలోని మలద్ ప్రాంతంలో… ఆయన ప్లాట్ లో అచేతనంగా పడి ఉన్నాడు. గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు… అక్కడికి వచ్చి అతన్ని పరిశీలించి చనిపోయినట్టుగా నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు… వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news