BREAKING : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విశాఖ వాసులు?

-

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ ఎంపీ.. ఈ స్కాంలో కల్వకుంట్ల కవితకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. అయితే.. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాం లో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఈ కేసులో విశాఖకు చెందిన వారి ప్రమేయం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ కేసులో కొన్ని సంస్థల ప్రమేయంపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆ సంస్థల్లో ఎవరెవరు, ఎంతెంత పెట్టుబడులు పెట్టారన్న విషయాలను కూపీ లాగుతున్నారు ఈడీ అధికారులు. లిక్కర్‌ వ్యాపారంలో ఆదాయం భారీగానే ఉంటుందన్న ఉద్దేశంతో నగరానికి చెందిన కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థల యజమానులు పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం అందుతోంది. పెట్టుబడులు పెట్టిన వారికి ఆ డబ్బు ఎలా వచ్చింది.. ఎంత పెట్టారు… దాని వెనుకు ఎవరు ఉన్నదానిపై అధికారులు విచారణ ముమ్మరం చేశారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news