ఉప్పల్ జంట హత్యల కేసులో ట్విస్ట్..క్షుద్రపూజలే కారణం !

-

ఉప్పల్ జంట హత్యల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉప్పల్ జంట హత్యల కేసుకు క్షుద్రపూజలే కారణమని తెలుస్తోంది. సంచలనం సృష్టించిన తండ్రి కొడుకుల హత్య కేసును రాచకొండ పోలీసులు చేదించారు.

ఉప్పల్ గాంధీ బొమ్మ సమీపంలోని హనుమసాయినగర్ కు చెందిన నర్సింహుల నరసింహ శర్మ(78), ఆయన కుమారుడు నరసింహుల శ్రీనివాస్(45) లు గత శుక్రవారం తెల్లవారుజామున హత్యకు గురైన సంగతి తెలిసిందే.

స్థిరాస్తి తగాదాలే హత్యలకు కారణం అని తోలుత భావించిన పోలీసులు, ఇప్పుడు క్షుద్ర పూజల కోణంలో దొరికిన ఆధారాలతో కేసును ఓ కొలిక్కి తెచ్చినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి సమీపంలో లభ్యమైన బ్యాగులో పసుపు, కుంకుమ పొట్లాలు లభ్యం కావడమే అందుకు కారణంగా తేలింది. హత్య ఘటన ప్రాంతంలో బ్యాగులో కుంకుమ పసుపు లభ్యం అయిందని పోలీసులు తెలిపారు. అలాగే.. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితులను‌ వైజాగ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news