మ‌హేష్ కు జోడి గా ఇద్ద‌రు హీరోయిన్స్ ?

-

టాలీవుడ్ సూప‌ర్ మ‌హేష్ బాబు హీరో గా స్టార్ డైరెక్ట‌ర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం లో త్వ‌ర‌లో ఓ సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమా లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కు జోడి గా ఇద్ద‌రు హీరోయిన్స్ ఉండ‌బోతున్నారు.. అనే వార్త తెలుగు సినీ పరిశ్ర‌మ ను షేక్ చేస్తుంది. అయితే త్రివిక్రమ్ శ్రీ‌నివాస్ ఈ సినిమాలో హీరో ను కాస్త కొత్త‌గా చూపెట్టాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

అయితే ఈ సినిమా కు సంబంధించి ఇప్ప‌టి కే ఒక హీరోయిన్ ను చిత్ర బృందం ఎంపిక చేసింది. ప్ర‌స్తుతం టాలీవుడ్ తో పాటు ఇత‌ర భాషల సినిమాల‌లో బిజీ గా గ‌డుపుతున్న పూజా హెగ్డే ఈ సినిమా లో మొద‌టి హీరోయిన్ గా న‌టిస్తుంది. అయితే ఈ సినిమా లో రెండో హీరోయిన్ గా ఒక ఒకరిని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. రెండో హీరోయిన్ గా లావ‌ణ్య త్రిపాఠి ని చిత్ర బృందం ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. అయితే ఈ సినిమా ను హారిక హాసిని క్రియేషన్స్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అలాగే యీ సినిమాకు త‌మ‌న్ సంగీత దర్శకుడి గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version