టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

-

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో సాయి లౌకిక్, సుష్మితను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కస్టడీలోని నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 17 మందిని సిట్ అరెస్ట్ చేసింది. తాజాగా లౌకిక్, సుష్మితను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియురాలు సుస్మిత కోసం లౌకిక్ డీఏఓ పేపర్‌ను కొనుగోలు చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ప్రవీణ్ నుంచి పేపర్‌ను రూ. 6 లక్షలకు లౌకిక్ ఈ పేపర్‌ను కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. ఫిబ్రవరి 26న జరిగిన DAO పరీక్ష జరగ్గా.. పేపర్ లీక్ అంశం తెరపైకి వచ్చిన తరువాత టీఎస్‌పీఎస్‌సీ ఈ పరీక్షను కూడా రద్దు చేశారు.

SIT Issued Notices To 30 TSPSC Employees In The Paper Leak Case | INDToday

మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక పోలీసులకు చేరింది. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక నుంచి సీజ్ చేసిన సెల్‌ఫోన్లను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు అధికారులు పంపించారు. ప్రవీణ్, రాజశేఖర్ లాప్టాప్, సిస్టమ్స్‌ను కూడా అధికారులు పంపించారు. ఈ నెల 11న కోర్టులో కేసు నివేదికను సిట్ సమర్పించనుంది. ఎన్నారై ప్రశాంత్‌పై మరోసారి సిట్ నోటీసులు జారీ చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news